- image : courtesy with Eenadu vasundara paper
అరటిపండు తింటూ తొక్కనీ, దోసకాయ వండుతూ చెక్కునీ తీసి పారేయడం అలవాటు. కానీ అసలు విషయమంతా వాటిల్లోనే ఉంది అంటున్నారు పోషకాహార నిపుణులు. పండ్లలో అసలు కంటే కొసరుగా ఉండే చెక్కులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని అధ్యయనాలూ వెల్లడించాయి. తీసి పారేయొద్దు... తింటేనే మేలు! ఆ వివరాలు తెలుసుకుంటే, తీసి పారేసే వాటితో విభిన్న వంటకాలను ప్రయత్నించొచ్చు. పోషకాలనూ పొందవచ్చు.
- బీరకాయ తొక్క :
- యాపిల్ తొక్క లో యాంటీ ఆక్సిడెంట్లు అధికం..
ఇక, పుల్లని నల్ల ద్రాక్షల విషయానికొస్తే, చాలామంది యథాతథంగా తినకుండా చక్కెర కలిపిన జ్యూస్గా తాగుతారు. రుచి బాగుంటుంది. కానీ రసం తీసి వడ కట్టినప్పుడు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండే చెక్కులో పాతిక శాతం వినియోగించుకోలేకపోతాం. దాంతో కొలెస్ట్రాల్ నిరోధక గుణాలనీ కోల్పోతాం. జామకాయలు మరీ పచ్చిగా ఉన్నా, పూర్తిగా పండినా ఏం చేస్తాం... ముక్కలుగా కోసం మధ్యలో ఉండే మెత్తని గుజ్జుని తినేస్తాం. కానీ ఇది సరికాదు. దీనివల్ల యాంతోసియానిన్ అనే క్యాన్సర్ నియంత్రణ కారకాన్ని పొందలేము.
కేక్లు, సలాడ్లలో నిమ్మపొడి...
నోటికి ఏ రుచీ సహించనప్పుడూ నిమ్మకాయ, చింతకాయ పచ్చళ్లు తినాలనిపిస్తుంది. రుచికంటే వీటికుండే వాసనే సగం సాంత్వన కలిగిస్తుంది. నిమ్మ, నారింజ చెక్కులో ఉండే మోనోటెర్పాన్స్ నూనెలు ప్రత్యేక వాసనలని వెదజల్లుతాయి. వీటికి చర్మ, కాలేయ, గర్భాశయ, వూపిరితిత్తుల క్యాన్సర్లని నివారించే శక్తి ఉంది. పచ్చళ్ల రూపంలో ఇప్పటికే వీటిని తింటున్నాం. పచ్చళ్లు వద్దనుకునే వాళ్లు నిమ్మతొక్కలతో చేసిన చాయ్కి హాయ్ చెప్పేయచ్చు. కేకులు, సలాడ్లలో లెమన్ పీల్ పొడిని చల్లుకొన్నా రుచిగానే ఉంటుంది. పదార్థాలని బేక్ చేసేటప్పుడూ, మఫిన్స్, బిస్కట్లలో కూడా ఈ పౌడర్ని ఎక్కువగా వాడుతుంటారు.
తెల్లని గుజ్జుని వదలొద్దు...
పుచ్చకాయ ముక్కలు అంటే ఎర్రని గుజ్జే అనుకుంటాం. కానీ అడుగున ఉండే తెల్లని పదార్థంలో పోషకాలు పుష్కలం. దాన్లో సిట్రులిన్ అనే పోషక పదార్థం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే అమినోయాసిడ్లు, విటమిన్ సి, విటమిన్ 'ఎ', థయామిన్, రైబోఫ్లెవిన్... రక్తహీనత రాకుండా చూసే ఇనుము, మెగ్నీషియమ్, ఎముకల బలానికి తోడ్పడే క్యాల్షియం ఉంటాయి. పోషకాలు అపారం కాబట్టి జ్యూస్ తయారు చేసేప్పుడు కాస్త లోతుగా కట్ చేయడం వల్ల తెలుపు రంగు పదార్థాన్నీ మిక్సీలో వేయొచ్చు.
దానిమ్మ టీ...
ఎర్రెర్రని దానిమ్మ గింజల్లో కంటే దాని పొట్టులో రెండు రెట్లు ఎక్కువగా శక్తివంతమైన పోషకాలుంటాయి. కానీ దానిని తినడం మనవల్ల అయ్యే పనికాదుగా. అందుకే దానిని ఎండబెట్టి పొడి చేసుకొని టీ చేసుకోవచ్చు.
* తీపి గుమ్మడి పులుసు పెట్టినప్పుడు చెక్కు తీయడం ఎందుకు? దానిలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేసే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికం.
* ఆలూ దుంపలపై ఉండే పొరలో విటమిన్సి, బి6, పొటాషియం, మాంగనీస్ పోషకాలు ఉంటాయి. అందుకే ఆలూ పరాటా చేసినప్పుడు పొట్టు తీయకుండా ఉంటే సరిపోతుంది
-- courtesy with Eenadu Telugu daily news paper
- =======================
No comments:
Post a Comment