- image : courtesy with Wikipedia.org.
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
Masala Tea,మసాలా టీ కి -- కావలసిన పదార్ధాలు :
నీరు ,
పాలు ,
టీ పొడి ,
పంచదార ,
టీ మసాలా పొడి ,
అర కప్పు నీటిలో అరకప్పు పాలు కలిపి స్పూన్ టీ పొడిని (కావలసినంత టీ పొడిని) వేసి ఒక పాత్ర లో వేడిచేయుదురు. సరిపడు పంచదార వేసి బాగా మరుగు తున్నప్పుడు ''టీమసాలా'' పొడిని ( అంటే ... అల్లం ఒక ముక్కలు , కొద్దిగ యాలక పొడి , దాల్చిన చెక్క , మిరియం పొడి కొద్దిగ కలిసిఉన్నది) కలిపి 10 నిముషాల తరువాత వడబోసి కప్పులో సెర్వ్ చేస్తారు . ఇది మామూలు బ్లాక్ టీ కి ' టీ మసాలా " పొడిని కలిపి తే మసాలా టీ తయారవుతుంది. మంచి రుచిగా ఉంటుంది.
- ==========================
No comments:
Post a Comment