ఇంటాబయటా పనుల ఒత్తిడీ, ఆధునిక జీవనశైలితో చాలామంది రక్తపోటు బారిన పడుతున్నారు. తినే ఆహారంలో తరచూ కొన్ని పదార్థాలను చేర్చుకోవడం వల్ల ఆ సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చు.
* వెల్లుల్లి : రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. రోజుకి మూడు వెల్లుల్లి పలుకులు తింటే రక్త ప్రసరణ సాఫీగా ఉంటుంది.
* నిమ్మకాయ : రోజూ కాస్త నిమ్మరసం తాగితే, రక్తనాళాలకు మంచిది. రక్తపోటు వల్ల నాళాలు దెబ్బతినే పరిస్థితి తలెత్తదు.
* తులసి : పొద్దున లేచిన వెంటనే బ్రష్ చేసుకొని నాలుగు తులసి ఆకులు నోట్లో వేసుకుని నమిలితే, చెడు కొలెస్ట్రాల్ పెరగదు.
* బంగాళాదుంప : తొక్కతో ఉన్న బంగాళాదుంపలు ఉప్పుని తక్కువ పీల్చుకుంటాయి. వీటిల్లో పొటాషియం పాళ్లు ఎక్కువ. రక్తపోటు రాకుండా చూడటంలో పొటాషియం ఎంతో ఉపయోగపడుతుంది.
* బియ్యం : ఎక్కువ పాలిష్ పెట్టని బియ్యంతో వండిన అన్నంలో కొలెస్ట్రాల్, కెలొరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఉప్పు శాతం తక్కువగా, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం నరాల వ్యవస్థని చల్లబరిచి ఎలాంటి ఒత్తిడి లేకుండా చేస్తుంది. దీనివల్ల బ్లడ్ప్రెషర్ అదుపులో ఉంటుంది.
- ======================
No comments:
Post a Comment